PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:01 am Posted by : Praja Sankshemam News

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ప్రవాసులతో సమావేశమైన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం ర్యాలీ నగరంలో

తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ప్రవాస తెలుగు ప్రజలతో ఆత్మీయ సమావేశం…

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీను యాదవ్ నాగనబోయిన, కరుణాకర్ వంగూరు, శేఖర్ నల్లబోతుల, రవీందర్ గడ్డంపల్లి తదితరులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘన సత్కారం…

తెలంగాణ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, రాష్ట్ర ప్రగతిలో వారి భాగస్వామ్యంపై విస్తృత చర్చ…

“ఎక్కడ ఉన్నా మాతృభూమిని మరువొద్దు” అని ప్రవాస తెలుగువారికి గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆకాంక్ష…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్య…

ప్రవాస భారతీయులు, అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్రముఖుల పాల్గొనడంతో సమావేశం విజయవంతం…