అమ్మవారి ఆశీస్సులు గ్రామస్తులకు మెండుగా లభించాలి:ప్రభుత్వ విప్ & ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

ప్రజాసంక్షేమం న్యూస్-నార్కెట్‌పల్లి నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాల పండుగకు భక్తుల ఆహ్వానం మేరకు హాజరైన ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు నార్కెట్‌పల్లి గ్రామస్తులకు మెండుగా లభించాలని ఆకాంక్షించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో తన నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.