
ప్రజా సంక్షేమం న్యూస్
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ను చితకబాదారు. తెలుగు బోధించే భాగ్యశ్రీ కొంతకాలంగా విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు, ఎబీవీపీ కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు.
అమ్మాయిలను వేధిస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని, పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.