ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి…!!!

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ...!!! ప్ప్రజాసంక్షేమం న్యూస్: ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలోని కమిటీ ప్రతినిధి బృందం శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిసి ఉద్యమకారుల గుర్తింపు,సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించింది.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్,కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ పాల్గొన్నారు.ఇటీవల హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక...