PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:34 am Posted by : Praja Sankshemam News

ఎమ్మెల్సీగా పున్నా కైలాష్ నేత? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దక్కే అవకాశం!

ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ
త్వరలో భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు అవకాశం దక్కనున్నట్లు ప్రచారం…
బీసీ సామాజికవర్గం నుంచి కాంగ్రెస్ అధిష్టానం కైలాష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో పదవి దాదాపు ఖాయమనే విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కైలాష్ నేత మునుగోడు బై పోల్ లో అధిష్టానానికి నమ్మకస్తుడిగా పనిచేసిన నెత గా మంచి పేరు తెచ్చుకుnనారు మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ నుంచి మంచి అవకాశాలు వచ్చిన వదులుకున్న నేతగా గుర్తింపు.కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతగా గుర్తింపు.తన సేవలను గుర్తించి డిసిసి అధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ అధిష్టానం.డీసీసీ అధ్యక్షుడిగా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమర్థంగా నడిపిస్తున్న నేతగా గుర్తింపు ఉన్నందున గవర్నర్ కోటాలో mlc ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.