PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 1:45 am Posted by : Praja Sankshemam News

ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి!

ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
ప్రజా సంక్షేమం న్యూస్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ/తహశీల్దార్) దేశాని శ్రీనివాసరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఆగస్టు 20,2026న ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు.
సోదాల వివరాలుఅధికారిక ఆస్తుల విలువ రూ.6.87 కోట్ల పైచిలుకు విలువైన స్థిరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.భూములు,నివాసాలు:రెండు ఫ్లాట్లు,ఒకపెెంట్‌హౌస్,10 ఎకరాల వ్యవసాయ భూమి, 8 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభించాయి.ఇతర పెట్టుబడులు,నగదు: బాలాపూర్‌లోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల పెట్టుబడి,రూ.4లక్షల నగదు,680 గ్రాముల బంగారం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.గతంలో మహేశ్వరం,బాలాపూర్, షాద్‌నగర్/షంషాబాద్ ప్రాంతాలలో తహశీల్దార్‌గా పనిచేశారు. 2009లోనూ ఆయనపై ఏసీబీ కేసు నమోదైంది.