PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 8:04 am Posted by : Praja Sankshemam News

కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్‌ను సందర్శించిన ఉపముఖ్యమత్రి:

ప్రజాసంక్షేమం న్యూస్:
కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్‌ను ఉపముఖ్యమత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారు సందర్శించి, యూటీ ఓపెన్ కాస్ట్ గోల్డ్ మైన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది.వ్యూ పాయింట్ నుండి బంగారం ముడి మట్టి వెలికితీత ప్రక్రియను వీక్షించి, గనికి సంబంధించిన మ్యాప్‌లను అధికారులతో కలిసి లోతుగా అధ్యయనం చేయడం జరిగింది.ఎంత లోతు నుంచి ముడి సరుకును సేకరిస్తున్నారు, అలాగే గత ఐదేళ్లలో ఓపెన్ కాస్ట్, అండర్‌గ్రౌండ్ గనుల ద్వారా జరిగిన ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నాను. సింగరేణి సీఎండీ శ్రీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.