PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 3:42 pm Posted by : sandeepemmadi78@gmail.com

కేటీఆర్‌పై ఏసీబీ సంచలన ఛార్జిషీట్

కేటీఆర్‌పై ఏసీబీ సంచలన ఛార్జిషీటకేటీఆర్‌పై ఏసీ

హైదరాబాద్ / ఉమ్మడి నల్లగొండ:
ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) 75 పేజీల సంచలన ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ప్రధాన ముఖ్యాంశాలు:
రైసింగ్ పేరిట నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై రూ.600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఏసీబీ ఆరోపణ.
ఈ కేసులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడు (A1)గా పేర్కొన్న ఏసీబీ.
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), బీఎల్ఎన్ రెడ్డి (A3), కిరణ్ మల్లేశ్వరరావు (A4), ఫార్ములా ఈ ఆపరేషన్స్ (A5) నిందితులుగా చేర్పు.
క్యాబినెట్, ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడి.
ప్రమోటర్ అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని, ప్రతిఫలంగా రేసింగ్ బాధ్యతలు అప్పగించారనే క్విడ్ ప్రో కో కోణాన్ని ప్రస్తావించిన ఏసీబీ.
కేటీఆర్‌పై ఐపీసీ 409, 120బీతో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు.