ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి.ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్-తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. డిసెంబరులో...