పెద్ది స్వప్నను పరామర్శించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న పరమపదించగా, శనివారం వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య నల్లబెల్లిలోని వారి స్వగృహానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి పెద్ది స్వప్నతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు...