PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:35 am Posted by : guntakamadhu@gmail.com

ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు


ప్రజా సంక్షేమం న్యూస్
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు, షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్ తెలంగాణకు, దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా, జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడారంగంలో వారు కనబరిచిన అంకితభావం, పట్టుదల, కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి, ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.