PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:04 pm Posted by : bolgurimukesh@gmail.com

బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు..

మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి నిరసనగా ఘటన!
ప్రజాసంక్షేమం న్యూస్ -నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రం లో కాంగ్రెస్,బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడిన దాడి ఘటనను నిరసిస్తూ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించి బీజేపీ నాయకుల ఫ్లెక్సీలను చించివేసినారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.