మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువ మొత్తాన్ని వసూలు చేయాల్సిందే!ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్ మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి గారు పౌరసరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి గారితో కలిసి ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం ఇచ్చి, తిరిగి ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం...