PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 5:43 am Posted by : bolgurimukesh@gmail.com

రత్తిపల్లి MPPS పాఠశాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

రత్తిపల్లి (ప్రజా సంక్షేమం న్యూస్):రత్తిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం రాఖీ పండుగ వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో అత్యంత కోలాహలంగా, ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నంద్యాల నర్సిరెడ్డి గారు మరియు ఉపాధ్యాయురాలు అయిషా గారు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — సోదర సోదరీమణుల అనురాగానికి, ఆప్యాయతకు మరియు రక్షణకు ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు. విద్యార్థులలో చిన్ననాటి నుంచే సాంప్రదాయాలు, నైతిక విలువలు మరియు తోటివారి పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి ఇటువంటి పాఠశాల వేడుకలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ వేడుకలలో భాగంగా విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ పాఠశాల ప్రాంగణంలో సంబరాల వాతావరణాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.