ప్రజా సంక్షేమం న్యూస్ నల్గొండ
ఈనెల 12న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య ,సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటీ లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట ప్రవీణ్ లు ఈనెల 12న ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుంటారని, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు ఎస్సీ, ఎస్టీ ల పై దాడులు, ఉద్యోగాల రోస్టర్ పాయింట్ అమలు బ్యాక్ లాగ్ పోస్టుల లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ఆయన తెలిపారు.