PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:40 am Posted by : Praja Sankshemam News

శివన్నగూడెం,రాచకొండ ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తాలనీ హరీష్ రావును కోరిన ఈ ఎల్ వి భాస్కర్!

*ప్రజా సంక్షేమం న్యూస్:*
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయడంతో పాటు,రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసేలా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని ఈ ఎల్ వి భాస్కర్ గారు కోరారు.ఈ మేరకు హరీష్ రావు గారిని స్వయంగా కలిసి,స్థానిక ప్రాజెక్టుల పురోగతి మరియు రైతాంగ సమస్యలపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ప్రాంతీయ సాగునీటి అవసరాలు,ప్రాజెక్టుల పూర్తితో లభించే ప్రయోజనాలను ఆయన వివరించారు.రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.