సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో తుమ్మిడిహట్టి బ్యారేజీ అంశం పై రెండు రాష్టాల తో కీలక సమావేశం:

ప్రజాసంక్షేమం న్యూస్: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నిరంతర ప్రయత్నాల నేపథ్యంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక,అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి గారు మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య...