హిందూ ముస్లింల మధ్య నాకు వ్యత్యాసం లేదు. హిందూ – ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు”:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
ప్రజా సంక్షేమం న్యూస్ హిందూ ముస్లింల మధ్య నాకు వ్యత్యాసం లేదు. హిందూ - ముస్లింలు ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన అభ్యర్థులు తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని పిలుపనిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 తదితర కేటగిరీల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన,...