PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 10:43 pm Posted by : Praja Sankshemam News

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై వెంటనే చర్యలు తీసుకోవాలి:తెలంగాణ రెడ్డి సంఘం

ప్రజాసంక్షేమం న్యూస్:
రెడ్లపై అసభ్యకర,అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ 1, 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు నకిరేకల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు కులాల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు ఉన్నాయని రెడ్డి సంఘం ఆరోపణ చేసింది సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ ఆందోళనచెందుతున్నట్లు తెలిపారు తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి రెడ్లపై వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిక చేశారు.