PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 4:19 pm Posted by : Praja Sankshemam News

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన:

ప్రజాసంక్షేమం న్యూస్-చిట్యాల
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారి ఆదేశాల మేరకు,ఈరోజు చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో చిట్యాల పట్టణంలోని ప్రజా సమస్యలపై చిట్యాల మున్సిపల్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దరఖాస్తులు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో.చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి,జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి,బొబ్బలి శివ శంకర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,నాగేష్,బొలుగురి సైదులు తదితరులు పాల్గొన్నారు