PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 10:47 am Posted by : bolgurimukesh@gmail.com

కోతులారం HM ను వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి: JAC’ & CSF పిలుపు

ప్రజా సంక్షేమం న్యూస్
కోతులారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) హెచ్‌ఎమ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేట్ విద్య నియంత్రణ JAC మరియు చరణ్య శ్రీ ఫౌండేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.నల్గొండ జిల్లా మునుగోడు మండలం, కోతులారం MPPS హెచ్‌ఎమ్ చేసిన తీవ్ర అవినీతి,అక్రమాలు మరియు అసభ్య ప్రవర్తనపై పక్కా ఆధారాలు సమర్పించినప్పటికీ,ఉన్నతాధికారులు కేవలం 2 ఇంక్రిమెంట్లు మాత్రమే కట్ చేసి నిందితుడిని రక్షించే ప్రయత్నం చేయడం దారుణమని సంఘ ప్రతినిధులు మండిపడ్డారు.విద్యార్థినులకు రక్షణగా నిలవాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి కంటితుడుపు చర్యలు తీసుకోవడం విద్యాశాఖ అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.ఈ రక్షణాత్మక వైఖరిని నిరసిస్తూ,సెప్టెంబర్ 07,2026న హైదరాబాద్‌లోని డైరెక్టర్ & కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DSE) కార్యాలయాన్ని భారీ ఎత్తున ముట్టడించనున్నట్లు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ మేరకు DSE కార్యాలయానికి ముందస్తు సమాచార లేఖను కూడా అందించినట్లు తెలిపారు.
మా ముఖ్య డిమాండ్లు:
నిధుల దుర్వినియోగం మరియు విద్యార్థినుల పట్ల అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎమ్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, ఉద్యోగం నుండి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలి.క్రిమినల్ కేసులు & అరెస్ట్ చిన్నారి విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించిన సదరు హెచ్‌ఎమ్‌పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి,అరెస్ట్ చేయాలి.కంటితుడుపు చర్యల వద్దు ఆధారాలున్నా కేవలం 2 ఇంక్రిమెంట్లు మాత్రమే కోత విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. తక్షణమే
రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు HM పై చర్యలు తీసుకోకపోతే,ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని విద్య నియంత్రణ JAC & చరణ్య శ్రీ ఫౌండేషన్ నాయకులు హెచ్చరించారు.