పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తం: మంత్రి పొంగులేటి
💠కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ 💠గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం 💠ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేదు ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్...