ప్రజాసంక్షేమం న్యూస్
బీసీలకు సంబంధించిన కీలక చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్,బీసీ నాయకులు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలి.బీజేపీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూనే, బీసీల జనాభాను లెక్కించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోంది? 2027 జనగణనలో బీసీల కుల గణనను తప్పనిసరిగా చేర్చాలి.బీసీల జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు,సంక్షేమం,రాజకీయ ప్రాతినిధ్యం ఎలా నిర్ణయిస్తారు? తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీల వివరాలు సేకరించినట్టే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి.బీసీలను లెక్కించడానికి ఎందుకు భయం?బీసీలకు న్యాయం జరిగే వరకు అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.