విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తగలడంతో గేదె మృతి:
ప్రజాసంక్షేమం న్యూస్ విద్యుత్ షాక్తో గేదె మృతిచెందిన ఘటన నిడమానూరు మండలంలోని బొక్కమంతులపాడ్ గ్రామంలో జరిగింది . గ్రామానికి చెందిన కుక్కల రంగారెడ్డి గేదె విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తగలడంతో మృతి చెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు. గేదె విలువ సుమారు రూ.1 లక్ష వరకు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతు కోరారు