ప్రజా సంక్షేమం న్యూస్
సీఎం రేవంత్రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్రెడ్డి తనకు ముందుగా చెప్పాలని ఆమె కోరారు. పదేళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ చెప్పుకోవడం వల్ల మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.తనను రాజీనామా చేయమని ఇప్పటివరకు సీఎం రేవంత్ ఎలాంటి సందర్భంలోనూ చెప్పలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏం చేసిందో, ఏం చేయబోతుందో ఢిల్లీలో మీడియా చిట్చాట్లో చెప్పారని పేర్కొన్నారు.అదేవిధంగా బీసీలకు ఒక న్యాయం, ఇతర వర్గాలకు మరో న్యాయమా? అని ఆమె ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.