ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు సీతక్క,కొండా సురేఖ:
ప్రజాసంక్షేమంన్యూస్
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి మంత్రులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే, మలక్పేట్ గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు ముఖ్యమంత్రి గారికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

