కనగల్ ఎక్స్రోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని జేసీబీతో తొలగించి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మౌన మానవహారం…
బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన…
విగ్రహ ధ్వంసం రాజ్యాంగాన్ని, దళిత సమాజాన్ని అవమానించడమే: నాగం వర్షిత్ రెడ్డి…
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నైతిక బాధ్యత వహించి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్…
బాధ్యులైన కాంట్రాక్టర్, అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్…
అదే ప్రదేశంలో ప్రభుత్వం సొంత ఖర్చులతో అంబేద్కర్ నూతన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్…
లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ హెచ్చరిక…

