Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుమహిళలు,బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం..బాధితులకు సత్వర న్యాయం,అండగా నిలవాలి” – ఎస్పీ

మహిళలు,బాలికల భద్రతకు భరోసా కేంద్రం కీలకం..బాధితులకు సత్వర న్యాయం,అండగా నిలవాలి” – ఎస్పీ

📰 Generate e-Paper Clip


ప్రజా సంక్షేమం
నల్గొండలోని భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. కేంద్రం ద్వారా మహిళలు, బాలికలు, చిన్నారులకు అందుతున్న పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సేవలను పరిశీలించారు.బాధితులకు సత్వర సహాయం అందిస్తూ, గోప్యత, గౌరవం, సానుభూతితో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో చైల్డ్ ఫ్రెండ్లీ విధానంలో విచారణ, కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి కేసును సున్నితమైన అంశంగా పరిగణించి వెంటనే స్పందించాలని, సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు న్యాయం జరిగే వరకు సహకారం అందించాలని ఎస్పీ సూచించారు.మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్‌చార్జ్ ఎస్‌ఐ అమ్రీన్, ఎస్‌ఐ గౌస్, ఏఎస్‌ఐ అబేదా, శ్రీనివాస్, కోఆర్డినేటర్ నళిని, సిబ్బంది, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.