Saturday, August 22, 2026
prajasamkshemam news
HomeUncategorizedస్కూల్ ఎడ్యుకేషన్,టి-సాట్ మధ్య విద్యా ప్రసారాలపై కుదిరిన ఎంఓయూ!

స్కూల్ ఎడ్యుకేషన్,టి-సాట్ మధ్య విద్యా ప్రసారాలపై కుదిరిన ఎంఓయూ!

📰 Generate e-Paper Clip

ఎంఓయూపై డైరెక్టర్ నవీన్ నికోలస్ మరియు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సంతకాలు‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’,‘పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక ఆన్ లైన్ డిజిటల్ క్లాసెస్’‘టి.ఎల్.ఎం మేళా’,
ఉపాధ్యాయులకు టి-సాట్ వేదికగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
హైదరాబాద్ లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఉదయం ఒప్పంద పత్రాల మార్పిడి

ప్రజా సంక్షేమం న్యూస్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అన్ని వేళలా అన్ లైన ద్వార అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒప్పంద పత్రాలపై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చకున్నారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్, వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఎంఓయూ ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య కార్యక్రమాల ప్రసారాల విషయంలో స్పష్టత వస్తుందని భావించారు.తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువున్న విద్యార్థుల తల్లిదండ్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ముఖాముఖి’, ‘ మా జిల్లా మా పాఠశాల’ పేరుతో డీఈవోలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం,ఉపాధ్యాయుల కోసం ‘టి.ఎల్.ఎమ్’ మేళా వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక నుండి టి-సాట్ వేదికగా ప్రసారం చేసుకునేందుకు ఎంఓయూ ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్, వేణుగోపాల్ రెడ్డి భావించారు. డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టి-సాట్ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్.ఇ.ఆర్.టి తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంఓయూ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి ప్రాజెక్ట్ జేడీలు, కో-ఆర్డినేటర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.