
ప్రజా సంక్షేమం న్యూస్
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కీలకమైన 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మరియు ఆర్థిక శాఖల తాజా ఆదేశాల ప్రకారం, ఇకపై ఆర్థిక సంఘం విడుదల చేసే ‘టైడ్ గ్రాంట్స్’ (Tied Grants) నిధులను కేవలం నీటి సరఫరా మరియు పారిశుధ్య పనులకే వెచ్చించాలని కేంద్రం స్పష్టం చేసింది.
నిధుల వినియోగంపై స్పష్టత:
* నీరు – పారిశుధ్యం: ఈ నిధులను తాగునీటి పథకాల నిర్వహణ, బోర్లు, చేతి పంపుల మరమ్మతులు మరియు గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ పనులకు మాత్రమే ఖర్చు చేయాలి.
* నిషేధం: పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, పంచాయతీ భవనాల నిర్మాణం లేదా ఇతర పనులకు ఈ టైడ్ నిధులను మళ్లించడానికి వీల్లేదని కేంద్రం కఠినంగా హెచ్చరించింది.
* ఆన్లైన్ పర్యవేక్షణ: ప్రతి పంచాయతీ తమ అభివృద్ధి ప్రణాళికలను కచ్చితంగా ‘ఈ-గ్రామ్ స్వరాజ్’ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. నిధుల పారదర్శకతను నిర్ధారించుకుంటేనే తదుపరి విడుదలకు అవకాశం ఉంటుంది.
గ్రామాల్లో మౌలిక వసతులు, ముఖ్యంగా స్వచ్ఛమైన తాగునీరు మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ మార్గదర్శకాలను పాటిస్తూ పనులను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నాను.
* దోమలపల్లి గోపి, ఉమ్మడి నల్గొండ రిపోర్టర్, ప్రజా సంక్షేమం న్యూస్.
(మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9248307393)

