Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలమయ్యేనా!

ఉద్యోగ సంఘాలతో చర్చలు సఫలమయ్యేనా!

📰 Generate e-Paper Clip

  • నేడు వి బి జి రాంజీ ఉద్యోగ సంఘాలతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తో చర్చలు
     . వి బి జి రాంజీ లో పని చేస్తున్న 4000 పైచిలుకు ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరేనా..
    పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థలో అమలవుతున్న వివిధ రకాల స్కీములలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల గత ఆరు రోజులుగా పెన్డౌన్ షట్ డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ శాంతియుతంగా తమ హక్కుల కోసం,ఫేస్కేల్ సాధన కోసం, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దీక్ష నేటికి ఆరవ రోజు చేరుకుంది.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగస్తులు తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని పే స్కేల్ రాబోతుందని ఈ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యోగ సంఘాలు కోటి ఆశలతో చర్చలకు సిద్ధమయ్యారు.మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు! దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఎనలేని కృషి చేసి మొదటి స్థానంలో నిలిపాము. ఇప్పుడు వి బి జి రాంజీ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని అందుకు ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేసి తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారని అలాగే తమ తమ దీర్ఘ కాలీక సమస్యలు పరిష్కారమైతే తమపై మరింత బాధ్యత పెరుగుతుందని మరింత నిబద్దలతో పని చేస్తామని ఇందుకుగాను ప్రభుత్వం తమపై దయ తలచి దీర్గాలకు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటున్నారు.
    గత ఆరు రోజులుగా లో పనిచేస్తున్న వివిధ సంఘాల ఉద్యోగస్తులతో నేడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రి దినసరి సీతక్క గారు చర్చలు చేపట్టనున్నారు గత 20 ఏళ్లుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, అదనపు ప్రోగ్రాం అధికారులు, కార్యాలయాలలో పనిచేసే సిబ్బంది వివిధ కేడర్లలో ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రస్థాయిలో దేశంలో మొదటి స్థానంలో నిలపడానికి అనేక రకాలుగా కృషి చేశారు. ఫలితంగా రాష్ట్రానికి దేశస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు నాటినుండి గ్రామస్థాయిలో కూలీలకు పనులు కల్పించడంతోపాటు సుస్థిర ఆస్తులను నెలకొల్పడం జీవనోపాదులను మెరుగుపరచడం, సహజ వనరుల యాజమాన్య పద్ధతులు పాటిస్తూ వ్యక్తిగత ఆస్తులను కూడగట్టడం, పండ్ల తోటల పెంపకం, రహదారుల నిర్మాణం, గ్రామపంచాయతీ నిర్మాణం, అంగన్వాడీలు వివో బిల్లింగ్ ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపి అనేక రకాల అవార్డులు & రివార్డులు దక్కించడంలో సిబ్బంది ఎనలేని కృషి చేశారు కానీ ఉద్యోగస్తులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గత 20 ఏళ్లుగా ఎట్టి చాకిరీ చేస్తూ పెరుగుతున్న నిత్యవసర వస్తువులధరలకు అనుకూలంగా వేతనాలు పెంచక పదోన్నతులు కల్పించక పిఎఫ్ ఈఎస్ఐ టిఏ డిఏ లాంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఓకే వ్యవస్థలో పనిచేస్తున్న SERP సిబ్బందికి పే స్కేల్ ను వర్తింపజేసి ఉపాధి హామీ సిబ్బందికి అమలు చేయకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ న్యాయమైన కోరిక పే స్కేల్ ఇచ్చి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.