Saturday, August 22, 2026
prajasamkshemam news
HomeUncategorizedమాల అమరవీరులకు హాలియా లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు

మాల అమరవీరులకు హాలియా లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు

📰 Generate e-Paper Clip

హాలియా (ప్రజా సంక్షేమం న్యూస్):
మాలల భావితరాల భవిష్యత్ కొరకు తమ ప్రాణాలని పణంగాపెట్టి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడి అమరులైన పివి రావు గారు పానంగి శేషయ్య గారు గోపతోటి నారాయణ గారు మాల అమరవీరులకు హాలియా లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన లకుమాల మధుబాబు మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎన్నమాల సత్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు బూర్గులవెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో హాలియా మండల కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నల్లగొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు గారి అధ్యక్షతన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమల్ల సత్యం గారితో కలిసి పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పవితరాల భవిష్యత్తు కొరకు తమ ప్రాణాలను పలంగా పెట్టి అమరులైన పివి రావు గారికి మరియు పానంగి శేషయ్య గారికి గోపతోటి నారాయణ గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి మాల అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి
లకుమాల మధు బాబు గారు మాట్లాడుతూఅప్పటి నియంత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 11 1997లో దళితుల రాజ్యాంగ హక్కుల కొరకు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలోని వేలాది మంది మాలలను గుర్రాలతో తొక్కించి వాళ్లు ప్రాణాలు పోవడానికి కారణమైనాడు ఇప్పుడు ఆయన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల ఓట్లతో తెలంగాణలో గద్దెనెక్కి అధికారం రాగానే మాలని తడి గుడ్డతో గొంతు కోసి వర్గీకరణ చేసి 5 శాతం రిజర్వేషన్ అని చెప్పి ఆ ఐదు శాతం రిజర్వేషన్లు కూడా రోస్టర్ పాయింట్ లో మాల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మార్చినాడు రాబోయే రోజులలో మాలమహానాడు ముందుండి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా చేసిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలోమాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి జంగాల భిక్షం గారు మరియు గండమాల జానయ్య గారు మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు చింతమల్ల పాండురంగయ్య గారు నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు లకుమాల లింగయ్య గారు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ రువ్వ వెంకటేశ్వర్లు గారు నిడమనూరు మండల ప్రధాన కార్యదర్శి మండారి రామాంజనేయులు గారు హాలియా పట్టణ అధ్యక్షులు రాయల వెంకన్న గారు మాల మహానాడు నాయకులు మోటమర్రి వెంకటేశ్వర్లు గారు మండల ముత్యాలు గారు నీరుడు ఇంద్రయ్య గారు గోగు యాదగిరి గారు బుల్లెద్దు మల్లేష్ గారు పెరుమాళ్ళ బద్రి గారు తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.