రామన్నపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద BRSV,BRSY ఆధ్వర్యంలో బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ప్రజా సంక్షేమం న్యూస్ | రామన్నపేట: తేదీ: 05-09-2026
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేశారని మండిపడ్డారు.ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.జీవో నెంబర్ 97 ను తక్షణమే రద్దు చేయాలి.జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలి.విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన స్వభావాన్ని వీడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో BRSV, BRSY నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

